సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, మాదాపూర్ చందానగర్ తదితర ప్రాంతాలలో భారీగా జల్లులు పడుతున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయ్యాయి. తీవ్రమైన ఎండలతో తల్లడిల్లిపోయిన ప్రజలకు.. ఈ భారీ జల్లులు కొంత మేర ఉపశమనం కలిగించాయి. అర్ధరాత్రి వర్షం కురవడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగలేదు.
నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అర్థరాత్రి భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, సిద్దిపేట, తదితర జిల్లాలలో అర్ధరాత్రి భారీ వర్షం పడింది.


