హైదరాబాద్: మిస్టర్ ఇండియాగా మదనపల్లికి చెందిన డాక్టర్ ఎంసీ సందీప్ ఎంపికయ్యారు.వీపీఆర్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో శనివారం జరిగిన ఫైనల్లో సందీప్ ఎన్నికైయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లికి చెందిన సందీప్ బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు.బెంగళూరుతో పాటు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో అనేక విజయవంతమైన గుండె శస్త్రచికిత్సలు చేశారు.
మిస్టర్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న డాక్టర్ సందీప్ను. మిస్సెస్ ఇండియా విజేత(2025) కవ్వం విజయలక్ష్మీరెడ్డి అభినందించారు. మారుమూల రాయలసీమ నుండి వచ్చి డాక్టర్తో పాటు మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచుకోవటం రాయలసీమవాసులందరి విజయం అని ఆమె పేర్కొన్నారు.


