తెలంగాణ: కేసులకన్నా.. డిశ్చార్జ్‌లే ఎక్కువ

Corona Cases In Telangana: Today 857 New Cases Reported - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 23,806 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 857 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,51,188కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1381కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  (మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్‌)

నిన్న ఒక్క రోజే 1,504 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,30,568కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 16,449 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 46,42,276కి చేరింది.  (కరోనావ్యాక్సిన్‌ కోసం వారు ఎదురుచూడకతప్పదా?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top