కాంగ్రెస్‌ తెలంగాణ పోరు ‘యాత్ర’

Congress Ex MLA Maheshwar Reddy About Telangana Poru Yatra - Sakshi

ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు... 

వచ్చే నెల మూడు నుంచి బాసరలో ప్రారంభం 

బాసర టు బోథ్‌ తర్వాత విరామం 

ప్రతి నియోజకవర్గంలో 1,2 రోజుల పాటు...  

గాంధీభవన్‌లో ముగింపు 

అధిష్టానం ఆదేశాల మేరకే... : మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మరో యాత్రకు సిద్ధమవుతోంది. మార్పు కోసం పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ యాత్ర ఓ వైపు కొనసాగిస్తుండగా, మరోవైపు నుంచి ఇంకో యాత్ర ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో వెల్లడించారు.

మహేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి మూడో తేదీ నుంచి ‘కాంగ్రెస్‌ తెలం­గాణ పోరు యాత్ర’ పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. బాసర సరస్వతీ దేవాలయంలో ప్రత్యేక పూజ­లు నిర్వహించిన తర్వాత భైంసా వరకు తొలి రోజు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత నిర్మల్, ఖానా­పూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్ఛోడ మీదుగా బోథ్‌ వరకు తొమ్మిదో తేదీవరకు యాత్ర నిర్వహిస్తారు.

మధ్యలో మార్చి 7వ తేదీన హోలీ సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించనున్నారు. తొమ్మి­దో తేదీన బోథ్‌ వరకు తొలి విడత యాత్ర ముగిసిన తర్వాత రెండో విడత షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. మొత్తం మీద బాసర నుంచి హైదరాబా­ద్‌ వరకు యాత్రను పూర్తి చేసి, ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించేలా యాత్ర షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.  ప్రతి నియోజకవర్గంలో 1,2 రోజుల పాటు యాత్ర కొనసాగేలా షెడ్యూల్‌ తయారు చేశామని,  అధిష్టానం ఆదేశాల మేరకే ఈ యాత్ర జరుగుతోందని, యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలందరూ పాల్గొంటారని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top