28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం

CM KCR Adopted Daughter Pratyusha Wedding On 28 December - Sakshi

సాక్షి, రంగారెడ్డి (కేశంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈ నెల 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయంలో జరగనుంది. ఉడుముల జైన్‌ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష వివాహం జరగనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పినతల్లి చేతుల్లో వేధింపులకు గురై వార్తల్లో నిలిచిన ప్రత్యూషను కేసీఆర్‌ గతంలో దత్తత తీసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top