మైనింగ్ స్కాం కేసులో కీలక పరిణామం | CID Registers Case In Telangana Mining Scam After Vigilance Report Flags Irregularities In Leasing And Permissions | Sakshi
Sakshi News home page

మైనింగ్ స్కాం కేసులో కీలక పరిణామం

May 30 2026 11:07 AM | Updated on May 30 2026 11:44 AM

CID registers case in Telangana mining scam

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మైనింగ్ కుంభకోణాల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.

గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజులు, అనుమతులు, తవ్వకాల ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వెయిరీకి ఆదేశించింది. ఈ క్రమంలో విజిలెన్స్ సంస్థ సమగ్ర పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో ఇకపై సీఐడీ ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపనుంది. సంబంధిత అధికారులు, అప్పటి నిర్ణయాధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ కొనసాగనుంది. అవసరమైతే కీలక పత్రాలు, ఫైళ్లు, అనుమతి రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై వరుసగా దర్యాప్తు ఆదేశాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement