BJP MP Arvind Mother Complaint At Banjara Hills PS On Attack At House - Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్‌ తల్లి ఫిర్యాదు

Nov 18 2022 7:10 PM | Updated on Nov 18 2022 8:21 PM

BJP MP Arvind Mother Complaint At Banjara Hills PS On Attack At House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటి దాడి ఘటనపై ఆయన తల్లి విజయలక్షి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 ప్రాంతంలో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్ఎస్ జండాలతో, కర్రలతో రాళ్లతో దాడి చేశారని తెలిపారు.

ఈ ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పింది. బెంజ్ కారు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ 50 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నపించారు.

కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని  ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. 
చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి..  ధర్మపురి అర్వింద్‌ తల్లి ఫిర్యాదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement