ఆరోగ్య సంరక్షణ రాజధానిగా చైన్నె | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సంరక్షణ రాజధానిగా చైన్నె

Oct 10 2025 6:22 AM | Updated on Oct 10 2025 6:22 AM

ఆరోగ్య సంరక్షణ రాజధానిగా చైన్నె

ఆరోగ్య సంరక్షణ రాజధానిగా చైన్నె

– జేసీఐ గుర్తింపు

సాక్షి, చైన్నె: ఆరోగ్య సంరక్షణ రాజధానిగా చైన్నె స్థానాన్ని బలోపేతం చేస్తూ ఆళ్వార్‌ పేట కావేరి ఆస్పత్రి జేసీఐ గుర్తింపు సాధించింది. ఈ మేరకు గురువారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. జనవరిలో వడపళణి యూనిట్‌కు ఈ గుర్తింపు దక్కగా, తాజాగా ఆళ్వార్‌ పేట యూనిట్‌ను ప్రతిష్టాత్మక జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌(జేసీఐ)8వ ఎడిషన్‌ అక్రిడిటేషన్‌ వరించింది. ఆరోగ్య సంరక్షణ, రోగి భద్రత, క్లినికల్‌ ఎక్సలెన్స్‌, పారదర్శకత, అత్యవసర ఏర్పాట్లు,నిరంతరం అభివృద్ధి, గ్రీన్‌ హాస్పిటల్‌,తదితర అంశాల ఆధారంగా ఈ గుర్తింపు కేటాయించారు. ఈ విజయం గురించి కావేరి సహ వ్యవస్థాపకుడు డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ మాట్లాడుతూ, ఇది సంస్థాగత మైలు రాయిగా కంటే ఎక్కువ అని అభివర్ణించారు. మెగురైన సేవలు, సమన్వయం, ఆరోగ్య సంరక్షణ, అధిక నాణ్యత , సమాజ సేవ, అధునాతన సాంకేతికత అంశాలు ఈ గుర్తింపు దక్కేలా చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఎఎన్‌ వైదీశ్వరన్‌, మెడికల్‌ డైరెక్టర్‌ అయ్యప్పన్‌ పొన్నుస్వామి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ మహేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement