– నెహ్రూ స్టేడియంలో పోటీ
సాక్షి, చైన్నె: బ్రెజిల్ ఫుట్బాల్ లెజెండ్స్ టూర్ ఖరారైంది. భారతదేశంలో ఫుట్బాల్ అభివృద్ధికి తోడ్పాటు కల్పించే విధంగా బ్రెజిల్ లెజెండ్స్ చైన్నెకు రానున్నారు. ఈనెల 30న నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఫుట్బాల్ ఆడనున్నారు. ఫుట్బాల్ ప్లస్ అకాడమీ నిర్వహించే ఈ పర్యటనకు చైన్నె జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు. చైన్నెకు రానున్న బ్రెజిల్ లెజెండ్స్లో రొనాల్డిన్హో, రివాల్డో, లూసియో, గిల్బెర్టో సిల్వా వంటి దిగ్గజ క్రీడాకారులు ఉన్నారు. వీరు ఇండియన్ ఆల్–స్టార్స్ విజయన్, మెహతాబ్ హుస్సేన్, కరణ్జిత్ సింగ్ క్రీడాకారులతో ఫుట్బాల్ మ్యాచ్లో తలబడనున్నారు. ఈ మ్యాచ్ తర్వాత, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో చైన్నెలో జరిగే రెండు రోజుల ఫుట్బాల్ సమ్మిట్లో ప్రపంచ కప్ విజేతలతో వర్క్షాప్లు, చర్చలు, ముఖాముఖి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ లెజెండ్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్ టికెట్లను బుక్ మై షో ద్వారా అందిస్తున్నామని ఫుట్బాల్ ప్లస్ అకాడమీ శుక్రవారం ప్రకటించింది. చైన్నెకి రానున్న లెజెండ్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.