
అరుణాచలేశ్వరునికి దోష నివృత్తి యాగ పూజలు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో అగ్ని నక్షత్రాన్ని పురష్కరించుకొని ఆలయంలో గత మూడు రోజులుగా అగ్ని నక్షత్ర దోష నివృత్తి యాగశాల పూజలను శివాచార్యులు వేద మత్రాల నడుమ చేస్తున్నారు. ముందగా అమ్మన్ సన్నిధి వద్దనున్న మండపంలో 1008 కళశాలను ఉంచి శివాచార్యుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ప్రార్థనలు చేశారు. ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడాలని, వర్షాలు కురవాలని, రైతులు పంటలు పండించాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అగ్ని నక్షత్రంతో పాటూ అమావాస్యను పురస్కరించుకుని శివాచార్యులు అమ్మన్ సన్నది వద్దనున్న కళశాలను ఊరేగింపుగా మేళ తాళాల నడుమ అరుణాచలేశ్వరుని సన్నది వద్దకు తీసుకొచ్చారు. అనంతరం మూడు రోజుల పాటు కలశాలను ఉంచి పూజలు చేసిన పుణిత నీటిని స్వామి వారికి అభిషేకం చేసి పుష్పాలంకరణలు చేశారు. ఈ సందర్భంగా శివాచార్యులు ప్రత్యేక వేద మంత్రాలు చదివి వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. అనంతరం దోష నివర్థి యాగ శాల పూజలు చేశారు. ఈ యాగశాల పూజా కార్యక్రమంలో ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్, వాచార్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అరుణాచలేశ్వరునికి దోష నివృత్తి యాగ పూజలు