ఆత్మ రక్షణ విద్య అవశ్యకతను తెలిపే వేంబు | - | Sakshi
Sakshi News home page

ఆత్మ రక్షణ విద్య అవశ్యకతను తెలిపే వేంబు

May 27 2025 1:56 AM | Updated on May 27 2025 1:56 AM

ఆత్మ

ఆత్మ రక్షణ విద్య అవశ్యకతను తెలిపే వేంబు

తమిళసినిమా: హరికృష్ణ, షీలా రాజ్‌కుమార్‌ జంటగా నటించిన చిత్రం వేంబు. మంజల్‌ సినిమా సంస్థ సమర్పణలో గోల్డెన్‌ షుర్స్‌ పతాకంపై ఎస్‌.విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభు దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ప్రేమానుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మేనత్తా మేనమామల పిల్లలైన హరికృష్ణ,షీలా రాజ్‌ కుమార్‌లకు బాల్యం నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. తన మేనమామ కూతురు షీలా రాజ్‌కుమార్‌కు చిన్నతనం నుంచి ఏది కావాలన్నా ఇస్తాడు హరికృష్ణ. అతను పెద్ద అయిన తరువాత ఒక ఫొటో స్టూడియోను నడుపుతాడు. షీలా రాజ్‌కుమార్‌ మంచిగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాదించాలన్న లక్ష్యంతో ఉంటుంది. ఈమె చిన్న తనం నుంచి కర్రసాము విద్యను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతుంది. అలాంటిది యుక్త వయసు వచ్చిన తరువాత గ్రామ పెద్దల సలహాతో హరికృష్ణ,షీలా రాజ్‌కుమార్‌లకు వారి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించకుంటారు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, తండ్రి కోసం షీలా రాజ్‌కుమార్‌ పెళ్లి పీటలు ఎక్కుతుంది. పెళ్లి అయిన తరువాత జరిగిన ఒక దుర్ఘటనతో భర్త చూపుకోల్పోతాడు. దీంతో వారి సంసార జీవితం ఆర్ధిక సమస్యలో చిక్కుకుంటుంది. అందులోంచి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి షీలా రాజ్‌కుమార్‌ ఏం చేసింద్‌? తన లక్ష్యాన్ని చేరుకుందా? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం వేంబు. ఇందులో ఆత్మరక్షణ విద్య అవశ్యత గురించి అవగాహన కలించే విధంగా పలు సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చిత్రాన్ని చక్కని సందేశాత్మకంగా దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకోవడం విశేషం. కాగా వేంబు చిత్రం ఈ శుక్రవారం తెరపైకి వచ్చింది.

ఆత్మ రక్షణ విద్య అవశ్యకతను తెలిపే వేంబు1
1/1

ఆత్మ రక్షణ విద్య అవశ్యకతను తెలిపే వేంబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement