
గ్రీవెన్స్డేలో 504 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో 504 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహించారు. గ్రీవెన్స్డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. పట్టాలు కోసం 120 వినతులు, పక్కాగృహల కోసం 65, ఉపాధి కోసం 62, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వాటి కోసం 136 వినతులతో కలిపి మొత్తం 504 వినతులు వచ్చింది. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం దాదాపు గంట పాటు అధికారులతో గత వారం స్వీకరించిన వినతులపై సమీక్ష నిర్వహించారు. పరిస్కరించిన వినతులు, పెండింగ్ వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్తో పాటూ గ్రీవెన్స్డేకు రెవెన్యూ, పోలీసులు, పీడబ్లూడీ, గ్రామీణభివృద్ధి, అగ్నిమాపశాఖ, ఎడ్యుకేషన్, సర్వేయర్ విభాగంతో పాటూ అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.
దాడిపై కలెక్టర్కు ఫిర్యాదు
తిరువళ్లూరు: వ్యక్తిగత అవసరాల కోసం 20 వేల రూపాయలు అప్పుగా తీసుకుంటే వడ్డీ అసలుతో కలిపి రెండు లక్షల రూపాయలను ఇవ్వాలని తమపై బయటి వ్యక్తులతో దాడులు చేయిస్తున్నారని ఓ మహిళ వాపోయారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్ ప్రతాప్కు సంచార కులాలకు చెందిన మహిళలు వినతి పత్రం సమర్పించారు. కాగా విచారణ చేయాలని డీఎస్పీని ఆదేశించారు.