కోదాడ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమతుల్యంగా ఉంది. వ్యవసాయం, సాగునీటి రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. విద్యారంగానికి 8.22 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. ఇది 10 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం ఆహ్వానించదగిన పరిణామం. ఉద్యోగులకు, పెన్షనర్లకు డిజిటల్ ఆరోగ్య కార్డులు, ద్యివాంగ విద్యార్థులకు వాహనాలు ఇస్తామనడం మంచి నిర్ణయం.
– బడుగుల సైదులు, ఆర్థిక విశ్లేషకుడు, కోదాడ


