నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వెళ్లేవారిని, స్పోర్ట్స్ బైక్స్తో ర్యాష్గా వెళ్లేవారిని సీసీ ఫుటేజీల ద్వారా పరిశీలిస్తున్నాం. జంక్షన్ నుంచి వేరే జంక్షన్ వెళ్లేలోపు వారిని ఆపుతున్నాం. నిబంధనలు మీరినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. డే అండ్ నైట్, అరవసల్లి మిల్లు జంక్షన్ల వద్ద హెల్మెట్ బ్యాంకులు పెట్టాం. మొన్నటి ప్రమాదంలో పేవ్మెంట్ ఢీకొని యువకుడు చనిపోవడంతో అలాంటివాటిపై దృష్టి పెట్టాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – వి.రామారావు, ట్రాఫిక్ సీఐ, శ్రీకాకుళం


