న్యూస్రీల్
‘దగా’ డీఎస్సీపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నాయకులు
● విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
● అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపాటు
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026
మండుటెండను లెక్క చేయలేదు. పోలీసు నిర్బంధాలకు వెరవలేదు. అక్రమాలపై నినదించారు. అన్యాయాలను ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులను అందలం ఎక్కించారని కలెక్టరేట్ సాక్షిగా గళమెత్తారు.


