కంచిలి మండల పరిధి గిరిజనులకు చెందిన నువాగడ పంచాయతీ పరిధి నువాగడ కాలనీలో నెలరోజులకు పైగా తాగునీటి కోసం స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న నీటి సౌకర్యాలన్నీ పాడవ్వడం, ఉద్దానం నీటి పథకం ద్వారా జేజేఎం ట్యాప్ పాయింట్లకు నీటి సరఫరా లేకపోవడం, స్థానికంగా ఉన్న పంచాయతీ నీటి పథకం బోరు కూడా పాడవ్వడం వంటి సమస్యలతో నీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
– మినతి గొమాంగో,
మాజీ సర్పంచ్, నువాగడ, కంచిలి మండలం


