● ‘ఆర్టీసీ ప్రైవేటీకరణ మానుకోండి’ | - | Sakshi
Sakshi News home page

● ‘ఆర్టీసీ ప్రైవేటీకరణ మానుకోండి’

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

పీఎస్‌ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని, లేదంటే పోరాటం తప్పదని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు హెచ్చరించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా ఆదివారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.దశరథుడు, జి.త్రినాథరావు, యూనియన్‌ ప్రతినిధులు ఎస్‌వీ రమణ, కె.బాబూరావు మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటాలకై నా సిద్ధమన్నారు.

–శ్రీకాకుళం అర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement