ఎస్పీ గ్రీవెన్స్కు 52 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరణకు 52 అర్జీలు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తక్షణమే తెలియపరచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకూడదని, వాటిపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక అందజేయాలన్నారు.


