ఆస్తులు అమ్ముకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

ఆస్తులు అమ్ముకుంటున్నారు

Jun 24 2025 3:21 AM | Updated on Jun 24 2025 3:21 AM

 ఆస్త

ఆస్తులు అమ్ముకుంటున్నారు

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా దారుణంగా ఉంది. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆశ పెట్టిన చంద్రబాబు రూ.7200 కోట్లు బకాయి పెట్టి మౌనంగా ఉంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.4200 కోట్లు, వసతి దీవెన రూ.2200 కోట్లు అవసరమైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2014–19 నుంచి టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ. 17వేల కోట్లు బకాయి పెడితే వైఎస్‌ జగన్‌ ఆ రు నెలల్లో ఆ బకాయి చెల్లించారు. కానీ చంద్రబాబు బకాయిలు ఇవ్వకపోవడంతో అనేక మంది ఆస్తులు అమ్ముకుని ఫీజులు కట్టి సర్టి ఫికెట్లు తీసుకోవాల్సి వస్తోంది.

– కుంభా రవిబాబు, వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిశీలకుడు

చంద్రబాబుకు కొత్త కాదు..

హామీలు ఇవ్వడం.. మర్చిపోవడం చంద్రబాబుకు కొత్త కాదు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద వింతకాదు. హామీలు అమలు చేసే సత్తా లేనప్పుడు ఎందుకివ్వాలి. ఏడాది పాలనలో 80శాతం హామీలు పూర్తిచేశామని చెబుతున్న తీరు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు.

– తమ్మినేని సీతారాం, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త

యువత ప్రశ్నించారు..

కూటమి పాలనలో జరిగిన అన్యాయంపై యువత ప్రశ్నించేందుకు భారీగా రావడం ఆనందంగా ఉంది. నిరుద్యోగులు, యువకులకు కూటమి ప్రభుత్వం రూ.7200 కోట్లు బకాయి పడింది. – ఎంవీ స్వరూప్‌, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

 ఆస్తులు అమ్ముకుంటున్నారు 
1
1/2

ఆస్తులు అమ్ముకుంటున్నారు

 ఆస్తులు అమ్ముకుంటున్నారు 
2
2/2

ఆస్తులు అమ్ముకుంటున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement