
బాత్రూమ్ క్లీనర్ తాగి వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: టెక్కలి శ్రీనివాసనగర్కు చెందిన రొక్కం రాజారావు(65) బాత్రూం క్లీనర్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజారావు కొన్నేళ్లుగా స్థానిక తెంబూర్ రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిమ్మకాయల వ్యాపారం చేస్తుండేవాడు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురై శనివారం తన ఇంట్లో ఉన్న బాత్రూం క్లీనర్ (లైజాల్) తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.