
రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ మృతి
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలాసకు చెందిన జి.కాంతారావు (28) అంపోలు సమీపంలోని కేశవరెడ్డి స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పనిమీద మిత్రుడితో కలిసి నరసన్నపేట నుంచి శ్రీకాకుళం ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఓ బిచ్చగాడు అడ్డంగా రావడంతో డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో కాంతారావు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ ఔట్ పోస్టుకు తరలించారు.