వైభవంగా కూర్మనాథుని జయంతి | - | Sakshi
Sakshi News home page

వైభవంగా కూర్మనాథుని జయంతి

Jun 23 2025 5:58 AM | Updated on Jun 23 2025 5:58 AM

వైభవం

వైభవంగా కూర్మనాథుని జయంతి

గార: శ్రీకూర్మనాథుని జయంతోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలో మూలవిరాట్‌కు వేకువజామున పంచామృతాభిషేకం జరిగింది. బాలభోగం అనంతరం స్నపన తిరుమంజనం సేవ నిర్వహించి ప్రధాన కలశాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. బేడా మండపంలో ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు ఉత్సవమూర్తికి వసంత కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి శీతల నైవేద్యం సమర్పించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వాములను అనివెట్టి మండపంలో వేంచింపజేసి ధర్మకర్త గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్థాన మంటపంలో తీర్థ జలాలు, క్షీరాభిషేకం, కుంకుమలతో అభిషేకం నిర్వహించారు. స్వామికి నూతన వస్త్రాలంకరణ జరిపి కూర్మనాథుని ఆవిర్భావ చరిత్ర వివరించారు. అనంతరం మంగళాశాసనం, ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ఈవో కె.నరసింహనాయుడు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, దాసుబాబు, శ్రీనివాసాచార్యులు, లక్ష్మణాచార్యులు, కిషోర్‌బాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా కూర్మనాథుని జయంతి 1
1/1

వైభవంగా కూర్మనాథుని జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement