ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్‌ సుబ్బారెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్‌ సుబ్బారెడ్డి

Jun 23 2025 5:58 AM | Updated on Jun 23 2025 5:58 AM

ఆదిత్

ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్‌ సుబ్బారెడ్డి

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి శెట్టి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాన్ని చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రధానార్చకులు శంకరశర్మ ఆలయ విశిష్టతను జస్టిస్‌కు వివరించారు. కార్యక్రమంలో కోర్టు ప్రోటోకాల్‌ సిబ్బంది, ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు.

గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి ఎస్‌.సుబ్బారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. మూలవిరాట్‌కు గోత్ర నామాలతో పూజలు జరిపించుకున్నారు. ఆల య ప్రధానార్చకులు సీహెచ్‌ సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహత్యాన్ని వివరించారు.

భూ తగాదాలో వ్యక్తికి గాయాలు

జి.సిగడాం: నాగులవలసలో ఆదివారం జరిగిన భూ తగాదాలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శశిధర్‌ ట్రాక్టర్‌తో సొంత పొలంలో దున్నేందుకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన వెంకట అప్పారావు తన పొలంలో నుంచి వెళ్తావా అంటూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శశిధర్‌ తలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని రాజాం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఎస్సై వై.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సిక్కోలుకు సముచిత

స్థానం

శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాకు సముచితస్థానం లభించింది. దశాబ్దకాలంలో సాఫ్ట్‌బాల్‌ క్రీడలో చెరగని ముద్రవేసుకున్న శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు కన్వీనర్‌ వంటి కీలకమైన మూడు స్థానాలు వరించాయి. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆదివారం ఏపీ రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ అనోకర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సాఫ్ట్‌బాల్‌ సంఘ పురోగాతికి, క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ, వివిధ జిల్లాకు స్పోర్ట్స్‌మీట్‌ల కేటాయింపు, క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు, స్పోర్ట్స్‌ కిట్‌ల పంపిణీకి ప్రతిపాదనలు వంటి అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల అధికారిగా రిజైర్డ్‌ జడ్జి పప్పల జగన్నాథరావు, అన్నెపు భువనేశ్వరరావు, పరిశీలకులగా శాప్‌ తరఫున డీఎస్‌డీఓ డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ తరఫున ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు, మెట్ట తిరుపతిరావు, గురుగుబెల్లి రాజశేఖర్‌, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ బి.వి.రమణ, గ్రిగ్స్‌ సెక్రటరీ కె.మాధవరావు, ఎం.ఆనంద్‌కిరణ్‌, ఢిల్లేశ్వరరావు, మహంతి, స్టేట్‌ సాఫ్ట్‌బాల్‌ కోచ్‌ బద్రి, 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూర శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. వందలాది మంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా చేసి.. సాఫ్ట్‌బాల్‌కు కేరాఫ్‌ సిక్కోలు అనేలా చేసిన మొజ్జాడ వెంకట రమణకు కీలకమైన రాష్ట్ర కన్వీనర్‌ పోస్టు లభించింది. కార్యవర్గ సభ్యులగా మరికొంతమందికి అవకాశం కల్పించారు.

ఆదిత్యుని సన్నిధిలో  జస్టిస్‌ సుబ్బారెడ్డి 1
1/1

ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్‌ సుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement