మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సినేషన్‌కు స్పెషల్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సినేషన్‌కు స్పెషల్‌ డ్రైవ్‌

Jun 24 2025 3:22 AM | Updated on Jun 24 2025 3:22 AM

మీజిల

మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సినేషన్‌కు స్పెషల్‌ డ్రైవ్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ జూన్‌ 23 నుంచి జూన్‌ 28 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు వెల్లడించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో 2వ విడత మీజిల్స్‌ రుబెల్లా నిర్మూలనా కార్యక్రమం బ్యానర్‌ను ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.అనిత మాట్లాడుతూ మీజిల్స్‌ రుబెల్లా స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా జూన్‌ 23 నుంచి జూన్‌ 28 వరకు జిల్లా వ్యాప్తంగా ఇమ్యునైజేషన్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డి.పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ వేణుగోపాల్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ రామ్స్‌, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జాబ్‌మేళాలో 182 మంది ఎంపిక

టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సొల్యూషన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్‌మేళాకు 246 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు బి.టి.ఇవెంజిల్‌, బి.ప్రేమ్‌కుమార్‌ పర్యవేక్షణలో నిర్వహించిన జాబ్‌మేళాలో 182 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.సతీష్‌కుమార్‌, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ వి.ల్యూక్‌పాల్‌, అధ్యాపకులు జి.కసవయ్య, వి.శాంతన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

లా సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల: బీఆర్‌ఏయూ అనుబంధ లా కాలేజీలో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఎగ్జామినేషన్‌ డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ సోమవారం విడుదల చేశారు. మూడేళ్ల కోర్సుకు సంబంధించి 1,3,5 సెమిస్టర్లు, ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సుకు సంబంధించి 1,3,5,7,9 సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు వెల్లడించారు. మూడేళ్ల న్యాయశాస్త్రంలో ఒకటో సెమిస్టర్‌కు సంబంధించి 110 మంది పరీక్షకు హాజరు కాగా 89 మంది, మూడో సెమిస్టర్‌లో90 మందికి 88 మంది, ఐదో సెమిస్టర్‌లో 94 మందికి 94 మంది ఉత్తీర్ణతను సాధించారని తెలిపారు. ఐదేళ్ల న్యాయశాస్త్ర కోర్సులో ఒకటో సెమిస్టర్‌కు సంబంధించి 29 మందికి 18 మంది, మూడో సెమిస్టర్‌ 24 మందికి 22 మంది, ఐదో సెమిస్టర్‌లో 28 మందికి 27 మంది, ఏడో సెమిస్టర్‌లో 20 మందికి 20 మంది, తొమ్మిదో సెమిస్టర్‌లో 25 మందికి 25 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. పరీక్ష ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌తో పాటు జ్ఞానభూమి పోర్టర్‌లలో విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. సందేహాలున్న విద్యార్థులు 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఏపీ పీఈ సెట్‌ పరిశీలకుడిగా శ్రీనివాసరావు

ఎచ్చెర్ల: ఈ విద్యా సంవత్సరంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీపీఈ సెట్‌– 2025కు పరిశీలకునిగా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిడీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం క్రీడా కార్యదర్శి డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి సెట్‌ కన్వీనర్‌ పి.జాన్సన్‌ వర్సిటీకి నియామక ఉత్తర్వులను అందించారు. వ్యాయామ, క్రీడా నైపుణ్యాల పరీక్షలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సినేషన్‌కు స్పెషల్‌ డ్రైవ్‌1
1/1

మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సినేషన్‌కు స్పెషల్‌ డ్రైవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement