అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..? | - | Sakshi
Sakshi News home page

అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..?

Jun 24 2025 3:22 AM | Updated on Jun 24 2025 3:22 AM

అన్నద

అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..?

రైతన్నను ఆదుకోవాలి

వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దుక్కి దున్నడంతో పాటు విత్తనాలు పోసేందుకు చేతిలో చిల్లి గవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రైతుభరోసా డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు దళారుల్ని ఆశ్రయించి అప్పలు వాడాలి వస్తోంది. ప్రభుత్వం చొరవ చూపి ఈ సీజన్‌కి కావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చేలా చూడాలి.

– మజ్జి రమణ,

అన్నంపేట గ్రామం, బూర్జ మండలం

ఆదేశాలు వచ్చిన వెంటనే..

ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో వేసేందుకు అడుగులు ముందుకేస్తుంది. రైతుల డేటాను అప్‌లోడ్‌ చేసి అర్హులందరికి అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 20వ విడత పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ డబ్బులు కలిపి ఒక్కసారి జమ చేసేందుకు కృషి చేస్తున్నాం.

– త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ):

వసరమైనప్పుడే సాయం చేయాలి.. పుణ్యకాలం కాస్తా అయిపోయాక సాయం అందినా లాభముండదు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ పనులు మొదలైపోయాయి. రైతన్నలు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు, నేటికీ రైతుల వివరాలు ఎన్‌ఐసీలో సక్రమంగా అప్‌లోడ్‌ చేయలేదు. వెబ్‌ల్యాండ్‌ వివరాలతో ఈ–క్రాప్‌ సింక్‌ అవ్వకపోవడం వంటి సాంకేతిక సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒక ఏడాది అన్నదాత సుఖీభవ పూర్తిగా ఎగ్గొట్టేశారని రైతులంతా మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైతులు కూడా ఆ జాబితాలో చేరిపోయారు.

పెట్టుబడికి కష్టాలు

అనుకున్న సమయానికి ప్రభుత్వం సాయం అందకపోవడంతో సన్నకారు రైతులు అప్పులు చేయక తప్పడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది కలగకుండా సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం గత ఏడాది పూర్తిగా సాయం ఇవ్వకుండా వదిలేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు తేదీ కూడా ప్రకటించలేదు. దీంతో రైతుకు పెట్టుబడి కష్టాలు పెరుగుతున్నాయి.

వైఎస్సార్‌ సీపీ హయాంలో..

జగన్‌ సర్కార్‌ రైతుకు ఇబ్బందులు కలగకుండా వైఎస్సార్‌ రైతు భరోసా సొమ్ము సకాలంలో ఖాతా ల్లో జమ చేసేది. ఖరీఫ్‌ పంట వేసేముందు ఏటా సరిగ్గా మే నెలలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద రూ.7,500 జమ చేసేది. తర్వాత అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోతతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండో విడతలో రూ.4 వేలు ఇచ్చేది. ఆ తర్వాత జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు... ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు ’వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ ద్వారా మొత్తం రూ.13,500 చొప్పున గత ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకంతో పాటు వైఎస్సార్‌ సున్నా వడ్డీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల భీమా, ఇన్‌పుట్‌ సబ్సిడి ఇలా అనేక పథకాలు ద్వారా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.

ప్రారంభమైన ఖరీఫ్‌ పనులు

‘అన్నదాత సుఖీభవ’ నిధుల కోసం ఎదురుచూపులు

ఏటా జూన్‌ 10లోపే జమచేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

కూటమి హయాంలో తీవ్ర జాప్యం

అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..? 1
1/2

అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..?

అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..? 2
2/2

అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement