ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Jun 24 2025 3:21 AM | Updated on Jun 24 2025 3:21 AM

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాలు డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఔ ట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ సోమవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జిల్లాలోని ఆర్టీసీ శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోలలో ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు దాదాపుగా 220 మంది పని చేస్తున్నారన్నారు. వీరి వేతనం దోపిడీకి గురవుతోందని అన్నారు. కార్యక్రమంలో ఏపీపీటీ డీ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు దాసరి కిరణ్‌, కార్యదర్శి పి.సంతోష్‌, జిల్లా ట్రెజరర్‌ ఆర్‌.నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement