‘యువత పోరు విజయవంతమైంది’ | - | Sakshi
Sakshi News home page

‘యువత పోరు విజయవంతమైంది’

Jun 24 2025 3:21 AM | Updated on Jun 24 2025 3:21 AM

‘యువత

‘యువత పోరు విజయవంతమైంది’

నరసన్నపేట: జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యువత పోరు విజయవంతమైందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. పార్టీ సమన్వయ కర్తలు, యువజన విభాగాల నాయకులు, ప్రత్యేకంగా నరసన్నపేట నుంచి 300 ద్విచక్ర వాహనాల ర్యాలీ ఆకట్టుకుందన్నారు. అలాగే యువత పోరు విజయవంతం కావడంలో పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌, జిల్లా అధ్యక్షుడు పృథ్వీ సమన్వయంతో పనిచేశారని కితాబునిచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోరాటం కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా నిలిచిందని పేర్కొన్నారు.

తిలారు ఫ్లై ఓవర్‌పై నుంచి ఆర్టీసీ బస్సులు

సారవకోట: జలుమూరు మండలంలోని తిలా రు గేట్‌ పై నిర్మించిన ఫ్లై ఓవర్‌ పై ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి ప్రయాణిస్తాయని ఆర్టీసీ మేనేజర్‌ రవిశంకర్‌ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్లే బస్సులు మాత్రమే తిలారు ఫ్లై ఓవర్‌ పై నుంచి వస్తున్నాయని, పాతపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే బస్సులు చల్లవాని పేట మీదుగా జర్జంగి, హరిశ్చంద్రాపురం, నిమ్మాడ నుంచి నరసన్నపేట వస్తున్నాయన్నారు. మంగళవారం నుంచి శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు తిలారు దగ్గర సర్వీసు రోడ్డులో నడుస్తాయని పాతపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే బస్సులు మాత్రం ఫ్లై ఓవర్‌ పై నుంచి వస్తాయన్నారు.

పునరావాస కాలనీ పరిశీలన

సంతబొమ్మాళి: మూల పేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం గ్రామానికి కేటాయించిన పునరావాస కాలనీని తహసీల్దార్‌ హేమసుందర్‌ పరిశీలించారు. ‘ఊరిని వదిలేసి వస్తే... గాలికొదిలేస్తారా..’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితం కావడంతో ఆయన స్పందించారు. జోరువానలో కూడా పునరావాస కాలనీ పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. ఎర్త్‌ ఫిల్లింగ్‌ పూర్తిస్థాయిలో చేయిస్తామని, మరుగుదొడ్లకు తలుపులు వేయిస్తామని, మురికి కాలువ నిర్మాణం త్వరలోనే చేయిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీలో ఎలాంటి విద్యుత్‌ సమస్య రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని విద్యుత్‌ లైన్‌మెన్‌ను ఆదేశించారు. ఆయనతో పాటు ఆర్‌ఐ ప్రసన్న తదితరులు ఉన్నారు.

గురుకుల ప్రవేశ పరీక్ష

సమయాల్లో మార్పు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల అడ్మిషన్‌ కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. దరఖా స్తు చేసుకున్న వారిలో జిల్లా వ్యాప్తంగా బాలు రుకు దుప్పలవలస, బాలికలకు ఎచ్చెర్లలోను పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 25న బుధవారం 6, 7వ తరగతులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, అదే రోజు మధ్యాహ్నం 8, 9వ తరగతులకు 2 నుంచి 3 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమ న్వయకర్త గుంపుల గ్రేస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమయాల్లో మార్పులను గమనించాలని ఆమె కోరారు. సందేహాలుంటే 9701736862/9000314209 నంబర్లకు ఫోన్‌ చేయాలని తెలిపారు.

‘యువత పోరు  విజయవంతమైంది’ 1
1/2

‘యువత పోరు విజయవంతమైంది’

‘యువత పోరు  విజయవంతమైంది’ 2
2/2

‘యువత పోరు విజయవంతమైంది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement