
గణపతినాయుడు.
ఎచ్చెర్ల క్యాంపస్: ఢిల్లీలో నిర్వహించే 2024 గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు శుక్రవారం ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా జాతీయ సేవాపథకం సమన్వయకర్త డాక్టర్ ఎం.అనురాధ గురువారం ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మైదానంలో ఈ ఎంపికలు జరుగుతా యని అన్నారు. మహిళా వలంటీర్లు ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు.
ఫుట్బాల్ జూనియర్ నేషనల్స్ పోటీలకు నరసన్నపేట విద్యార్థి
నరసన్నపేట: జూనియర్ నేషనల్స్ అండర్–17 విభాగంలో మధ్యప్రదేశ్లో జరిగే ఆలిండియా ఫుట్బాల్ టోర్నమెంట్లో నరసన్నపే ట పురుషోత్తం నగర్కు చెందిన గౌతమ్ సాయి పాల్గొననున్నాడు. ఈ నెల 22 నుంచి జరగబోయే నేషనల్స్లో ఆంధ్ర తరఫున గోల్ కీప ర్గా పాల్గొంటున్నట్లు కోచ్ రాకేష్ తెలిపారు.
వైఎస్సార్ సీపీ న్యాయవిభాగం జోనల్ ఇన్చార్జిగా వాసుదేవరావు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ న్యాయవిభాగం జోనల్ ఇన్చార్జిగా గేదెల వాసుదేవరావు, అధ్యక్షులుగా జీవీవీ గణపతినాయుడులను నియమించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

గేదెల వాసుదేవరావు

గౌతమ్ సాయి