పండగ పూట విషాదం | - | Sakshi
Sakshi News home page

పండగ పూట విషాదం

Sep 20 2023 2:00 AM | Updated on Sep 20 2023 11:10 AM

భార్య కుమారుడితో మృతుడు రవి - Sakshi

భార్య కుమారుడితో మృతుడు రవి

పండగ పూట ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వినాయక చవితి వైభవంగా నిర్వహించుకుందామని భార్యకు చెప్పి వెళ్లిన భర్త మార్గం

శ్రీకాకుళం: పండగ పూట ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వినాయక చవితి వైభవంగా నిర్వహించుకుందామని భార్యకు చెప్పి వెళ్లిన భర్త మార్గం మధ్యలో బైక్‌ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. విశాఖలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేర కు ఆనందపురం పంచాయతీ ఆబోతులపేట గ్రామానికి చెందిన కీస రవి(27) వినాయక చవితి సామాన్లు కొనుగోలు చేయడానికి ఆదివారం రాత్రి పొందూరు వెళ్లి తిరిగి ఆబోతులపేట గ్రామానికి వస్తుండగా.. ఆనందపురం, వాండ్రంగి గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద మరో బైక్‌ రవి బైక్‌ను ఢీకొట్టింది.

ఘటనలో రవి తీవ్రంగా గాయపడ్డాడు. మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని శ్రీకాకుళంలోని కిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి విశాఖ పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి సోమవారం కన్నుమూశాడు. రవి వెనుక కూర్చున్న సోమరాజుల కృష్ణ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

అలాగే పొందూరుకు చెందిన స్వరూప సాయి, హరి సాయి, పేడాడ దామోదరరావు రాజాం కేర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మృతుడికి భార్య స్వామి, తొమ్మిది నెలల బాబు ఉన్నారు. పండగ వేళ ఇంతటి విషాదం జరగడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సామంతుల రామారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement