మరణంలోనూ వీడని బంధం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని బంధం

Jun 19 2023 12:44 AM | Updated on Jun 19 2023 10:54 AM

మృతిచెందిన త్రిమూర్తులు, నాగమణి(ఫైల్‌)  - Sakshi

మృతిచెందిన త్రిమూర్తులు, నాగమణి(ఫైల్‌)

శ్రీకాకుళం: శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ విషాద ఘటన కోటబొమ్మాళి మండలం సుబ్బారావుపేట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేట మండలం బాడాం గ్రామానికి చెందిన బమ్మిడి త్రిమూర్తులు(45), నాగలక్ష్మి(40) దంపతులు శనివారం కోటబొమ్మాళి మండలం సుబ్బారావుపేటలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. భోజనాల అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్లేందుకు సుబ్బారావుపేట జంక్షన్‌లో జాతీయ రహదారి వద్దకు చేరుకుని బస్సు కోసం వేచిచూస్తున్నారు.

ఇంతలో టెక్కలి వైపు నుంచి అతివేగంగా వస్తున్న లారీ వీరిద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో త్రిమూర్తులు అక్కడికక్కడే మృతిచెందగా, కొనఊపిరితో ఉన్న నాగలక్ష్మిని 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వీరికి ముగ్గురు కుమారులు మురళీ, మణి, లక్ష్మణ ఉన్నారు. అందరూ చదువుతున్నారు. పెద్దకుమారుడు మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ అలీ తెలిపారు.

త్రిమూర్తులు, నాగమణి దంపతులు పేద కుటుంబానికి చెందిన వారు. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడివారిని కంటతడి పెట్టించింది. దంపతుల మృతి పట్ల సర్పంచ్‌ డోల గోవిందరావు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement