హిందూపురం: స్థానిక గుడ్డం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కట్టడం పైనుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. శనివారం సాయంత్రం భవనం పై అంతస్తులో ఎర్రకొట్టాలకు చెందిన ఎలక్ట్రీషియన్ బాబ్జాన్ (30) పని చేస్తూ ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ సమయంలో అతనితో పాటు సవార్లపై నిలబడిన మరో కార్మికుడు జావీద్ఖాన్ కూడా కిందపడ్డాడు. తోటి కార్మికులు గమనించి ఇద్దరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాబ్జాన్ మృతి చెందాడు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


