మహిళ ఆత్మహత్య
ధర్మవరం: స్థానిక మాధవ్నగర్కు చెందిన విజయలక్ష్మి (38) ధర్మవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం చెరువు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేని ఆమె తన తండ్రి చంద్రశేఖర్ వద్ద ఉంటోందని పోలీసులు తెలిపారు. జీవితంపై విరక్తితోనే ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
మహిళ ఆత్మహత్య
మహిళ ఆత్మహత్య
మహిళ ఆత్మహత్య


