ఇలా ఉంటే రోగాలు రావా? | - | Sakshi
Sakshi News home page

ఇలా ఉంటే రోగాలు రావా?

Oct 18 2025 9:49 AM | Updated on Oct 18 2025 9:49 AM

ఇలా ఉంటే రోగాలు రావా?

ఇలా ఉంటే రోగాలు రావా?

ధర్మవరం రూరల్‌: వీధుల్లో మురుగుపారుతూ అపరిశుభ్రంగా ఉంటే రోగాలు రావా? అని జిల్లా పరిషత్‌ సీఈఓ శివశంకర్‌ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపైనే మురుగునీరు, దిబ్బలు ఉండటం చూసి పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఎవరికి వారు తమ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని మురుగు నీటిని రోడ్లపైకి వదలకూడదన్నారు. అనంతరం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన వెంట ఎంపీడీఓ సాయిమనోహర్‌, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్‌, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

అపరిశుభ్రతపై జెడ్పీ సీఈఓ అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement