
అవ్వకు అష్టకష్టాలు
ఈ వృద్ధురాలు భీమరాయునిపేట గ్రామానికి చెందిన బ్యాల్ల నీలమ్మ. రేషన్కార్డులో ఈమెతో పాటు భర్త ఉన్నారు. వీరు రేషన్ బియ్యం కోసం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లానారాయణపల్లికి వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామానికి వెళ్లడానికి బస్సు, ఆటో సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే బయల్దేరింది. 65 ఏళ్ల వయసు మీద పడిన నీలమ్మ రేషన్ కోసం అష్టకష్టాలు పడి నడిచి వెళితే అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వచ్చింది. ‘గతంలో ఇంటి వద్దే సరుకులు తీసుకునేవాళ్లం. ఈ వయసులో మాకు ఈ అగచాట్లు ఏమిటో అర్థం కావడం లేదు’ అని నీలమ్మ వాపోయారు.
– తాడిమర్రి