
అనంతపురం–బెంగళూరు రైలు ప్రారంభం
అనంతపురం సిటీ: అనంతపురం–బెంగళూరు మధ్య ప్యాసింజర్ రైలును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, ఎమ్మెల్యే సునీత, డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, అహుడా చైర్మన్ టీసీ వరుణ్తో కలసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అనంతపురం నుంచి బెంగళూరుకు రూ.50కే చేరుకోవచ్చన్నారు. 12 బోగీలుంటాయన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో వాటరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని డీఆర్ఎంకు సూచించారు. మెమూ రైలు సాయంత్రం బెంగళూరు నుంచి అనంతపురానికి బయలుదేరేలా చూడాలని ఎమ్మెల్యే సునీత కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ గుత్తా కేశవ నాయుడు, సౌత్ సెంట్రల్ రైల్వే డీజీఎం ఉదయ్నాథ్, రైల్వే సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఎంఓ శ్రవణ్ కుమార్, సీనియర్ డీఈఈ సుదర్శన్రెడ్డి, ఏడీఆర్ఎం సుధాకర్, అనంతపురం రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.