సర్వే పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సర్వే పక్కాగా చేపట్టాలి

Jun 5 2025 7:46 AM | Updated on Jun 5 2025 7:46 AM

సర్వే

సర్వే పక్కాగా చేపట్టాలి

పుట్టపర్తి టౌన్‌: జనాభా పెరుగుదలకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై చేపట్టిన సర్వే జిల్లాలో పక్కాగా సాగాలని కలెక్టర్‌ చేతన్‌ అఽధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ‘జనాభా నిర్వహణ విధానం’పై ప్రభుత్వం రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జనాభా సమతుల్యతే లక్ష్యంగా చేపట్టిన సర్వేను సచివాలయ సిబ్బంది ఈనెల 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య సేవలో మెరుగుదల, పిల్లలు, మహిళలు, వృద్ధులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తొమ్మిది ప్రశ్నలు సర్వేలో అడుగుతుందని, ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఓ విజయకుమార్‌ తోపాటు అధికారులు పాల్గొన్నారు.

యోగాంధ్ర నిర్వహణకు

స్థల పరిశీలన

లేపాక్షి: ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం లేపాక్షిలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ స్థల పరిశీలన చేపట్టారు. వీరభద్రస్వామి ఆలయం ఆవరణతో పాటు ఆలయం ఎదుట ఉన్న పార్కులు, నంది విగ్రహం ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్‌తో చర్చించిన అనంతరం వీటిలో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహమూర్తి, డీటీ కుమారస్వామిరెడ్డి, వీఆర్వో రమేష్‌, ఏఎస్‌ఐ షర్ఫుద్దీన్‌ పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాను

సహించం

‘చిత్రావతి’ సమీప ప్రాంతాల్లో ఆర్డీఓ తనిఖీలు

9 టిప్పర్లు, 3 ట్రాక్టర్లపై జరిమానా

ధర్మవరం అర్బన్‌: ఇసుక అక్రమ రవాణాను సహించబోనని ఆర్డీఓ మహేష్‌ అన్నారు. బుధవారం ఆయన చిత్రావతి నది పరివాహక ప్రాంతాలైన ఉప్పలపాడు, పీసీరేవు, సీసీరేవు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని ప్రాంతంలో ఇసుకను తవ్వి తరలిస్తున్న 9 టిప్పర్లు, 3 ట్రాక్టర్లకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... చిత్రావతి నది ఒడ్డున ఇసుకను అక్రమంగా తవ్వినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే వాహనాలను జప్తు చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో మైనింగ్‌, ఇరిగేషన్‌, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

లేపాక్షి: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష డిసెంబర్‌ 13వ తేదీన జరుగుతుందన్నారు. దరఖాస్తులు వెబ్‌సైట్‌ www.navodaya.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.

సర్వే పక్కాగా చేపట్టాలి 1
1/2

సర్వే పక్కాగా చేపట్టాలి

సర్వే పక్కాగా చేపట్టాలి 2
2/2

సర్వే పక్కాగా చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement