కర్ణాటక మద్యం స్వాధీనం

స్వాధీనం చేసుకున్న కారు, కర్ణాటక మద్యాన్ని చూపుతున్న   సెబ్‌ పోలీసులు  - Sakshi

ధర్మవరం అర్బన్‌: బెంగళూరు నుంచి కడపకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.50 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని సెబ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. పట్టణంలోని సెబ్‌ స్టేషన్‌లో మంగళవారం సెబ్‌ సీఐ విలేకరులతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన శ్రీనివాసులు, కరుణాకరన్‌ మంగళవారం ఉదయం టాటా ఇండికా కారులో కడపకు రూ.1.50 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పట్టణంలోని ప్యాదిండి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో తనిఖీ చేసి పట్టుకున్నామన్నారు.

ఇద్దరినీ అరెస్టు చేసి మద్యం, కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలో శ్రీనివాసులుపై హిందూపురం సెబ్‌ స్టేషన్‌లో అక్రమ మద్యం కేసు ఉందన్నారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top