
శాస్త్రోక్తంగా ఊంజల్సేవ
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి ఊంజల్సేవను శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకార మండపంలోకి తీసుకొచ్చి అక్కడ తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని ఉదయం జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

శాస్త్రోక్తంగా ఊంజల్సేవ