పాఠశాల వ్యాన్‌ ఢీకొట్టడంతో.. | - | Sakshi
Sakshi News home page

పాఠశాల వ్యాన్‌ ఢీకొట్టడంతో..

Sep 2 2025 3:17 PM | Updated on Sep 2 2025 3:17 PM

పాఠశాల వ్యాన్‌ ఢీకొట్టడంతో..

పాఠశాల వ్యాన్‌ ఢీకొట్టడంతో..

భర్త మృతి, భార్యకు గాయాలు

ఆత్మకూరు: పాఠశాల వ్యాన్‌ మోటార్‌బైక్‌ను ఢీకొట్టడంతో షేక్‌ ఖాసీం (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలోని కరటంపాడు గ్రామం వద్ద నెల్లూరు – ముంబై రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. ఉదయగిరి మండలానికి చెందిన షేక్‌ ఖాసీం తన భార్య హజరత్‌బీతో కలిసి ఉదయగిరి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల వ్యాన్‌ కరటంపాడు గ్రామంలోకి మలుపు తిరుగుతూ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఖాసీం మృతిచెందాడు. హజరత్‌బీకి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement