
నేర నియంత్రణకే కార్డన్ అండ్ సెర్చ్
కావలి: నేర నియంత్రణకే కార్డన్ అండ్ సెర్చ్ను నిర్వహిస్తున్నామని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. కావలి రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని పెంకుల ఫ్యాక్టరీ కాలనీలో కార్డనన్ అండ్ సెర్చ్ను శనివారం నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంట్లోని వ్యక్తుల ఆధార్ కార్డులతో పాటు వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాల్లేని 55 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలను సీజ్ చేశారు. సీఐలు గిరిబాబు, రాజేశ్వరరావు, ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.