వృద్ధుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి బలవన్మరణం

Mar 11 2025 12:10 AM | Updated on Mar 11 2025 12:11 AM

బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన బిజ్జం వెంకారెడ్డి (75) తన ఇంట్లోనే ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకారెడ్డి కుటుంబ సభ్యులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆయన ఒక్కడే స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో తిరుపతికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఏడాది నుంచి పనిమనిషిగా ఉంది. ఈనెల 4వ తేదీన యజమాని మందలించాడనే కారణంతో శాంతమ్మ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో ఏం జరిగిందో గానీ వారం తిరిగేసరికి వెంకారెడ్డి కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement