వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నం

Aug 11 2023 12:30 AM | Updated on Aug 11 2023 8:00 AM

- - Sakshi

టీడీపీ నాయకుడు కప్పిర శ్రీనివాసులు దంపతుల ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులైన అరవ శౌరీ, మస్తానీ దంపతులపై గురువారం కొందరు కత్తులు

నెల్లూరు(క్రైమ్‌)/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నాయకుడు కప్పిర శ్రీనివాసులు దంపతుల ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులైన అరవ శౌరీ, మస్తానీ దంపతులపై గురువారం కొందరు కత్తులు, కర్రలతో హత్యాయత్నం చేశారు. ఈ ఘటన నగరంలోని సంతపేట మార్కెట్‌ వద్ద చోటుచేసుకుంది. బాధితుల సమాచారం మేరకు.. 50వ డివిజన్‌కు చెందిన అరవ శౌరీ, మస్తానీ వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు, రౌడీషీటర్‌ కప్పిర శ్రీనివాసులు, ఆయన భార్య రేవతి వారిపై తరచూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.

ఇటీవల శౌరీ, మస్తానీ అనుచరులను టీడీ పీలోకి రావా లని తీవ్ర ఒత్తి డి తెచ్చారు. వారు నిరాకరించడంతో కోపంతో రగ లిపోయారు. ఈ నేపథ్యంలో గురువా రం శౌరీ, మస్తా నీ దంపతులు సంతపేట మార్కెట్‌ వద్ద ఇంట్లో ఉండగా కప్పిర దంపతుల అనుచరులు కే చిన్న, ఇమానుయేలు, సాయిలతో పాటు మరో 12మంది కత్తులు, కర్రలతో వారిపై దాడిచేసి పరారయ్యారు. గాయాలపాలైన వారిని కుటుంబసభ్యులు 108 సాయంతో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు బాధితురాలు అరవ మస్తానీ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర డీఎస్పీ డీ శ్రీనివాసరెడ్డి, సంతపేట ఇన్‌స్పెక్టర్‌ బీ కళ్యాణ్‌రాజ్‌ ఆస్పత్రికి చేరుకుని హత్యాయత్నం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. కప్పిర శ్రీనివాసులు దంపతులతో పాటు మరో 12మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement