WPL 2023 Auction: స్మృతి మంధానకు జాక్ పాట్.. ఎన్ని కోట్లంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జాక్ పాట్ కొట్టింది. ముంబై వేదికగా జరుగుతోన్న ఈ వేలంలో స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మంధాన కోసం ఆది నుంచే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరికి బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
కాగా ఈ వేలంలో మంధాన తన బేస్ ప్రైస్ రూ.50లక్షలగా నిర్ణయించుకుంది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను రూ. 1.8 కోట్లకు మంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ యాష్ గార్డెనర్ను రూ.3.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకోంది. ఇక ఈ వేలంలో మొత్తం 90 బెర్త్ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.
Join us in welcoming the first Royal Challenger, Smriti Mandhana! 😍
Welcome to RCB 🔥#PlayBold #WeAreChallengers #WPL2023 #WPLAuction pic.twitter.com/7q9j1fb8xj
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023
చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..