డాక్టర్‌ పుల్లెల గోపీచంద్‌! | Pullela Gopichand awarded honorary doctorate | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ పుల్లెల గోపీచంద్‌!

Jul 5 2023 5:41 AM | Updated on Jul 5 2023 5:41 AM

Pullela Gopichand awarded honorary doctorate - Sakshi

బెంగళూరు: భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు మరో గౌరవం దక్కింది. కర్ణాటకకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.

మంగళవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. జాతీయ అభివృద్ధిలో క్రీడల ద్వారా తనదైన పాత్ర పోషించినందుకు గోపీచంద్‌ను డాక్టరేట్‌ కోసం ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గోపీచంద్‌తో పాటు మరో నలుగురు కూడా దీనిని అందుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement