BWF Rankings: తొలిసారి టాప్‌–20లోకి పుల్లెల గాయత్రి జోడీ 

Pullela Gayatri, Treesa Jolly Pair Enters Top 20 In BWF Rankings - Sakshi

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి తన భాగస్వామి ట్రెసా జాలీ (కేరళ)తో కలిసి కెరీర్‌ బెస్ట్‌ 19వ ర్యాంక్‌కు చేరుకుంది.

మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం రెండు స్థానాలు పురోగతి సాధించి భారత నంబర్‌వన్‌ జోడీగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ రెండు స్థానాలు ఎగబాకి మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top