తొలిసారి టాప్‌–20లోకి పుల్లెల గాయత్రి జోడీ  | Pullela Gayatri, Treesa Jolly Pair Enters Top 20 In BWF Rankings | Sakshi
Sakshi News home page

BWF Rankings: తొలిసారి టాప్‌–20లోకి పుల్లెల గాయత్రి జోడీ 

Nov 30 2022 8:32 AM | Updated on Nov 30 2022 10:43 AM

Pullela Gayatri, Treesa Jolly Pair Enters Top 20 In BWF Rankings - Sakshi

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి తన భాగస్వామి ట్రెసా జాలీ (కేరళ)తో కలిసి కెరీర్‌ బెస్ట్‌ 19వ ర్యాంక్‌కు చేరుకుంది.

మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం రెండు స్థానాలు పురోగతి సాధించి భారత నంబర్‌వన్‌ జోడీగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ రెండు స్థానాలు ఎగబాకి మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement