IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌.. యువ ఆటగాడు వచ్చేశాడు..!

Prithvi Shaw set to rejoin Delhi Capitals after recovering from illness Says Reports - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూ్స్‌ అందింది. జ్వరంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన యువ ఓపెనర్‌ పృథ్వీ షా కోలుకున్నాడు. దీంతో అతడు సోమవారం(మే16​‍) పంజాబ్‌ కింగ్స్‌తో జరగబోయే ఢిల్లీ తదుపరి మ్యాచ్‌కు  అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఈ ఏడాది సీజన్‌లో పృథ్వీ షా ఓపెనర్‌గా ఢిల్లీకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. షా గత మూడు మ్యాచ్‌లకు దూరం కావడంతో ఢిల్లీకు సరైన ఆరంభం లభించడంలేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రీకర్‌ భరత్‌ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇక ఈ సీజన్‌లో పృథ్వీ షా 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 259 పరుగులు చేశాడు. 

చదవండి: తూచ్‌.. రిటైర్‌ కావట్లేదు..! రిటైర్మెంట్‌ ట్వీట్‌ను డిలీట్‌ చేసిన అంబటి రాయుడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top