National Youth Weightlifting Championship: స్వర్ణం నెగ్గిన గురు
చెన్నై: జాతీయ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శనపతి గురు నాయుడు స్వర్ణ పతకాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన యూత్ పురుషుల 55 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురు నాయుడు మొత్తం 233 కేజీలు (స్నాచ్లో 104+క్లీన్ అండ్ జెర్క్లో 129) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ప్రపంచ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో గురునాయుడు 55 కేజీల విభాగంలో మొత్తం 230 కేజీలు బరువెత్తి బంగారు పతకం సాధించాడు. తాజాగా జాతీయ టోర్నీలో అతను అదనంగా మరో మూడు కేజీలు ఎక్కువ బరువెత్తడం విశేషం.