మొయిన్‌ అలీ కోసం సీఎస్‌కే పంతం!

Moeen Ali Sold To CSK For Rs 7 Crore - Sakshi

చెన్నై: ఈ ఐపీఎల్‌ వేలంలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కోసం తీవ్ర పోటీ నడిచింది. పంజాబ్‌ కింగ్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌లు మొయిన్‌ కోసం చివరి వరకూ పోటీలో నిలిచాయి. ఈ క్రమంలోనే అతని ధర పెరుగుతూ పోయింది. మొయిన్‌ అలీ కనీస ధర రూ. 2 కోట్ల ఉండగా అతన్ని రూ. 7 కోట్లకు సీఎస్‌కే పంతం​ పట్టి మరీ దక్కించుకుంది. 

ఇక బంగ్లాదేశ్‌ అల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. షకీబుల్‌ను 3 కోట్ల 20 లక్షల రూపాయలకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది. షకీబుల్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ కూడా పోటీ పడినా కేకేఆర్‌ చివరి దక్కించుకుంది. 

ఇక్కడ చదవండి: : స్టీవ్‌ స్మిత్‌కు జాక్‌పాట్‌ లేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top