బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు | - | Sakshi
Sakshi News home page

బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు

Sep 11 2025 6:40 AM | Updated on Sep 11 2025 6:40 AM

బుగ్గ

బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు

సిద్దిపేటరూరల్‌: స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు సాధికారికత కోసం చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతనిధులు కితాబిచ్చారు. బుధవారం మండల పరిధిలోని ఇర్కోడ్‌ గ్రామాన్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని స్వయం ఉపాధి పథకంలో భాగంగా మహిళలు చేస్తున్న పచ్చళ్ల తయారీ యూనిట్‌ను, మహిళా సాధికారక కార్యక్రమాలు, యూనిఫాంల తయారీ వంటివాటిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యం బాగుందని, గ్రామాన్ని సందర్శించడం వల్ల చాలా విషయాలు తెలిసాయన్నారు. కార్యక్రమంలో సీఆర్‌డీ సీఈఓ అనిల్‌కుమార్‌, ఎంపీడీఓ మురళీధర్‌శర్మ, డీఎల్‌పీఓ మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీఓ విష్ణువర్ధన్‌, ఏపీఓ కిషన్‌, ఏపీఎం ధర్మసాగర్‌, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటరూరల్‌: స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయానికి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు వచ్చినట్లు ఆలయ చైర్మన్‌ కరుణాకర్‌, ఈఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నారాయణరావుపేట శివారులోని స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకలను దేవాదాయ, పోలీసుల సమక్షంలో లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో రూ.1,70,293 సమర్పించుకున్నారన్నారు. ఈ డబ్బును దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి, చైర్మన్‌ కరుణాకర్‌, డైరెక్టర్లు శ్రీనివాస్‌, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

‘భూ భారతి’ సమస్యలు

పరిష్కరించండి

అలసత్వం చూపితే చర్యలు

కలెక్టర్‌ హైమావతి

కొండపాక(గజ్వేల్‌): భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవని కలెక్టర్‌ హైమావతి హెచ్చరించారు. కొండపాకలోని సమీకృత కార్యాలయం భవనాన్ని బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ భూ హక్కుల పరిరక్షణ కోసం భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైన వారు నిర్మాణాల విషయాల్లో జాప్యం చేస్తే నోటీస్‌ అందించి మరొకరి పేరిట మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచుతూ పారదర్శకత లోపించకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్యామ్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాగి జావ ఆరోగ్యానికి మేలు

డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాగి జావ ఆరోగ్యానికి మేలు చేస్తుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే రాగిజావ పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ప్రతినిఽధి మహదేవ్‌ నరేష్‌, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మహిళల భాగస్వామ్యం భేష్‌

ఇర్కోడ్‌ను సందర్శించిన

ఉత్తరప్రదేశ్‌ ప్రతినిధులు

బుగ్గరాజేశ్వరుడి హుండీ  ఆదాయం రూ.1.70లక్షలు1
1/2

బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు

బుగ్గరాజేశ్వరుడి హుండీ  ఆదాయం రూ.1.70లక్షలు2
2/2

బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement