
ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం
టీచర్ల తీరుపై సర్వత్రా చర్చ
చేర్యాల(సిద్దిపేట): తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఉపాధ్యాయులు వ్యవహరించారు. మూడు రోజుల ముందే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మంగళవారం ముస్త్యాల మోడల్స్కూల్లో ఎంఈఓ కిష్టయ్య ఆధ్వర్యంలో టీఎల్ఎం మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. విచిత్రమేమిటంటే ఈ సందర్భంగా పలువురి ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయడం గమనార్హం. ఈ విషయమై ఎంఈఓ కిష్టయ్యను వివరణ అడగగా 5వ తేదీన సెలవు ఉందని, కనుక ముందస్తుగా జరుపుకొన్నట్లు చెప్పారు.